కొవిడ్ బాధితులకు మాస్క్లు, శానిటైజర్ల పంపిణీ
ABN , First Publish Date - 2021-06-17T04:41:15+05:30 IST
ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న కొవిడ్ బాధితులకు నేచర్ క్రియాశీలక సంస్థ మాస్క్లు, శానిటైజర్లు, పండ్లు పంపిణీ చేసినట్లు నేచర్ సంస్థ కార్యదర్శి ఎస్. మోహనరావు తెలిపారు.
టెక్కలి: ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న కొవిడ్ బాధితులకు నేచర్ క్రియాశీలక సంస్థ మాస్క్లు, శానిటైజర్లు, పండ్లు పంపిణీ చేసినట్లు నేచర్ సంస్థ కార్యదర్శి ఎస్. మోహనరావు తెలిపారు. డైరెక్టర్ వికాస్ బాలరాజు ఉన్నారు. టెక్కలికి చెందిన దివ్వల జీవరత్నం తన కుమారుడు తనూష్ పుట్టినరోజు సందర్భంగా నిరుపేదలకు అభయం యువజన సేవా సంఘం ద్వారా మాస్క్లు, శానిటైజర్లు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో దేవాది శ్రీనివాస్, సింహాచలం, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయుడి కుటుంబానికి సాయం
కొత్తూరు (హిరమండలం): ఇటీవల కరోనాతో మృతి చెందిన పూనిపేట ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు అదపాక గణేష్ కుటంబానికి యూ టీఎఫ్ మండల ప్రతినిధులు బాసటగా నిలిచారు. రూ.1,05,000 వసూలు చేసి ఆయన కుటుంబానికి బుధవారం అందిం చారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు బెవర నాగరాజు, కె.కోటేశ్వరరావు, పి.సంపత్ కుమార్ పాల్గొన్నారు.