స్కూలు, గుడికి మైక్సెట్ల వితరణ
ABN , First Publish Date - 2022-08-10T05:43:41+05:30 IST
స్కూలు, గుడికి మైక్సెట్ల వితరణ
ఆమనగల్లు, ఆగస్టు 9: శెట్టిపల్లి పాఠశాల, వేంకటేశ్వర స్వామి ఆలయానికి సర్పంచ్ గోదాదేవి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎగిరిశెట్టి సత్యం మైక్సెట్లు, ఆంప్లీఫైర్, సౌండ్ బాక్స్లను బహూకరించారు. రూ.30వేలతో వాటిని కొనుగోలు చేశారు. మంగళవారం వేంకటేశ్వరాలయం, పాఠశాల ఆవరణలో ఆలయ నిర్వాహకులు, పాఠశాల ఉపాధ్యాయులకు వాటిని సత్యం అందజేశారు. సత్యంను స్థానికులు, ఆలయ నిర్వాహకులు, ఉపాధ్యాయులు సత్కరించారు. స్థానికుల సహకారంపైనే ప్రభు త్వ పా ఠశాలల మనుగడ ఆధారపడిందని పేర్కొన్నారు. ఇందుకు దాతలు ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ వెంకటయ్య, చిక్కొండ సాయిలు, నర్సింహ, లక్ష్మయ్య, జగదీశ్వర్, గోపి, మహేశ్, సురేశ్, జగన్, శేఖర్ పాల్గొన్నారు.