జగన్ ప్రజా వ్యతిరేక పాలనపై కరపత్రాల పంపిణీ

ABN , First Publish Date - 2022-07-07T02:51:56+05:30 IST

బాపట్ల జిల్లా: అమర్తలూరు మండలం ఇంటూరులో ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు పాల్గొన్నారు. గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రజా వ్యతిరేక విధానాలపై ముద్రించిన కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ

జగన్ ప్రజా వ్యతిరేక పాలనపై కరపత్రాల పంపిణీ

బాపట్ల జిల్లా: అమర్తలూరు మండలం ఇంటూరులో ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు పాల్గొన్నారు. గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రజా వ్యతిరేక విధానాలపై ముద్రించిన కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ పాలనకు వ్యతిరేకంగా గ్రామ, పట్టణాల్లో స్పష్టమైన మార్పు కనపడుతోందని, వైసీపీలో మోసానికి గురైన వారు టీడీపీలోకి వస్తున్నారని చెప్పారు. విజయమ్మ, షర్మిళ చేతిలో బైబిల్ పట్టుకున్నారని దళితులు ఎగబడి ఓట్లు వేశారని, అయితే ప్రస్తుతం జగన్ మాత్రం స్వామీజీల దగ్గర, గంగలో మునిగి జంజం వేసుకున్నాడని పేర్కొన్నారు. అసలు జగన్ మోహన్ రెడ్డి  హిందువో... క్రిస్టియనో ధైర్యంగా చెప్పాలని డిమాండ్ చేశారు.  సీబిఐ కేసు దర్యాప్తు ప్రారంభమయితే జగన్ జైలుకి వెళ్తారని అన్నారు. 

Updated Date - 2022-07-07T02:51:56+05:30 IST