సేవా సంస్థలకు పీపీఈ కిట్లు పంపిణీ

ABN , First Publish Date - 2021-06-13T05:07:46+05:30 IST

కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థలకు స్నేహహస్తం ఫౌండేషన్‌ వారి సహకారంతో పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్కులు, శానిటైజర్లను జాయింట్‌ కలెక్టర్‌ సాయికాంత్‌ వర్మ పంపిణీ చేశారు.

సేవా సంస్థలకు పీపీఈ కిట్లు పంపిణీ
మాట్లాడుతున్న జేసీ సాయికాంత్‌వర్మ

జేసీ సాయికాంత్‌వర్మ

కడప(కలెక్టరేట్‌), జూన్‌ 12: కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థలకు స్నేహహస్తం ఫౌండేషన్‌ వారి సహకారంతో పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్కులు, శానిటైజర్లను జాయింట్‌ కలెక్టర్‌ సాయికాంత్‌ వర్మ పంపిణీ చేశారు. శనివారం కొవిడ్‌-19 సెకండ్‌ వేవ్‌ రిలీఫ్‌ సర్వీసు-2021 నగరంలోని పాతరిమ్స్‌లోని నిరాశ్రయుల వసతి గృహంలో ఫెయిడ్‌ ఎన్జీవో కె.నాగేశ్వరరెడ్డి, సి.హెచ్‌.ఆర్‌.డి.ఎ్‌ఫ ఎన్జీవో శివారెడ్డి, బ్లెస్లీ ఫౌండేషన్‌ ఎన్జీవో శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగింది. జేసీ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో అంత్యక్రియలకు సేవా సంస్థల ప్రతినిధులు మానవత్వంతో ముందుకు రావడం గొప్ప విష యమన్నారు. కార్యక్రమంలో ఎస్జీవో సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-13T05:07:46+05:30 IST