గిరిజనులకు పట్టాల పంపిణీ

ABN , First Publish Date - 2020-11-29T04:34:07+05:30 IST

చిన్నారాయుడుపేట, సూరంపేట, బక్కుపేట, రేపటివలస గ్రామాల్లోని 63 మంది గిరిజనులకు పోడు పట్టాలను ఎమ్మెల్యే అలజంగి జోగారావు అందజేశారు.

గిరిజనులకు పట్టాల పంపిణీ
బొబ్బిలి రూరల్‌: గిరిజనులకు పట్టాలు అందజేస్తున్న ఎమ్మెల్యే

సీతానగరం :

చిన్నారాయుడుపేట, సూరంపేట, బక్కుపేట, రేపటివలస గ్రామాల్లోని 63 మంది గిరిజనులకు పోడు పట్టాలను ఎమ్మెల్యే అలజంగి జోగారావు అందజేశారు. శుక్రవారం చిన్నారాయుడుపేటలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా గిరిజనులకు పట్టాలు అందజేశారు.  వైసీపీ నాయకులు నాగేశ్వరరావు, వలంటీర్లు, వీఆర్‌వోలు పాల్గొన్నారు. బొబ్బిలి రూరల్‌:  స్థానిక రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్‌ ప్రసాద్‌పాత్రో ఆధ్వర్యంలో  ఎమ్మెల్యే శంబంగి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మొదటి విడతలో నాలుగు పంచాయతీ ల్లోనూ 226 మంది లబ్ధిదారులకు 379.55 ఎకరాల భూమిని పంపిణీ చేశామన్నారు. రెండో విడతలో డొంగురువలస, బట్టివలస గ్రామాలకు చెందిన 35 మందికి 61.56 ఎకరాల భూమి పత్రాలు అందజేశామన్నారు.  కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్‌లు సాయికృష్ణ, గౌరీశంకర్‌, ఆర్‌ఐ అప్పలనాయుడు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. 

 


 

Updated Date - 2020-11-29T04:34:07+05:30 IST