గిరిజనులకు రేషన్‌ పంపిణీ

ABN , First Publish Date - 2021-03-09T05:35:42+05:30 IST

మండలంలోని మర్రి గూడ, పెద్దగూడ పంచాయతీల పరిధిలోని పది గిరిజన గ్రామాల వారికి సోమవారం రేషన్‌ పంపిణీ చేశారు.

గిరిజనులకు రేషన్‌ పంపిణీ
రేషన్‌ పంపిణీ చేస్తున్న సిబ్బంది

హిరమండలం: మండలంలోని మర్రి గూడ, పెద్దగూడ పంచాయతీల పరిధిలోని  పది గిరిజన గ్రామాల  వారికి సోమవారం రేషన్‌ పంపిణీ చేశారు. తహసీల్దారు సత్యనారా యణ పర్యవేక్షణలో  కార్యక్రమం జరిగింది.  ‘ఆంధ్రజ్యోతి’లో సోమవారం ప్రచురితమైన ‘గిరిజనుల ఆకలి కేకలు’  శీర్షికతో ప్రచురితమైన కథనానికి  రెవెన్యూ అధికారులు  స్పందించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తహసీల్దారు సత్యనారాయణ రెవెన్యూ సిబ్బంది తో  సోమవారం ఉదయం  ప్రతి గ్రామానికి వెళ్లి  రేషన్‌ పంపిణీ కి చర్యలు తీసుకున్నారు. సాయంత్రం వరకు తహసీల్దారు అక్కడే ఉంటూ..  లబ్ధిదారుల వేలిముద్రల నమోదు, సరుకుల పంపిణీ చర్యలు  చేపట్టారు. కార్యక్రమంలో సర్పంచ్‌ నందిని,  వీఆర్వో ఆనంద్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ గిరీశ్‌ ఉన్నారు.

Updated Date - 2021-03-09T05:35:42+05:30 IST