ప్రైవేట్‌ ఉపాధ్యాయులకు బియ్యం పంపిణీ

ABN , First Publish Date - 2021-04-24T04:38:52+05:30 IST

మండలంలో పనిచేస్తున్న ప్రైవేట్‌ ఉపాధ్యాయులకు శుక్రవారం తహసీల్దార్‌ మధుకర్‌ బియ్యంపంపిణీ చేశారు.

ప్రైవేట్‌ ఉపాధ్యాయులకు బియ్యం పంపిణీ
బియ్యం పంపిణీ చేస్తున్న తహసీల్దార్‌

వాంకిడి, ఏప్రిల్‌ 23: మండలంలో పనిచేస్తున్న ప్రైవేట్‌ ఉపాధ్యాయులకు శుక్రవారం తహసీల్దార్‌ మధుకర్‌ బియ్యంపంపిణీ చేశారు. లాక్‌డౌన్‌ కార ణంగా పాఠశాలలు మూతపడడంతో ప్రభుత్వం ఒక్కో ఉపాధ్యాయుడికి 25కిలోలబియ్యం మంజూరు చేసి నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎంఈవో మన కుమార్‌, ఎస్‌ఆర్‌పీలు సందీప్‌, సునీల్‌, వాంకిడి, ఇంధాని ఉన్నతపాఠశాలల ప్రధానోపాధ్యాయులు వామన్‌రావు, సుభాష్‌, ప్రైవేట్‌ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఆసిఫాబాద్‌రూరల్‌: కరోనా కష్టకాలంలో ప్రైవేటు ఉపాధ్యాయు లకు, సిబ్బందికి ప్రభుత్వం చేయూత నందిస్తుందని మార్కెట్‌ కమిటీ వైస్‌చైర్మన్‌ గాదవేణి మల్లేష్‌ అన్నారు. శుక్రవారం గుండి గ్రామంలోని ప్రైవేటుపాఠశా లకు చెందిన ఉపాధ్యాయులు, సిబ్బం దికి 25కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేశారు. కార్యక్ర మంలో సర్పంచ్‌ అరుణ, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ శ్యాంరావు, ఉపసర్పంచ్‌ శేషాద్రీ, మాజీఎంపీటీసీ రవిందర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-04-24T04:38:52+05:30 IST