క్రీడాకారిణికి రూ.50 వేలు నగదు పంపిణీ
ABN , First Publish Date - 2022-01-23T04:50:32+05:30 IST
మండల పరిధిలోని మనేరాంపల్లె గ్రామానికి చెందిన కుస్తీ క్రీడాకారిణికి రూ.50 వేలు ఆర్థికసాయం టీడీపీ నాయకులు అందచేశారు.
దువ్వూరు, జనవరి 22: మండల పరిధిలోని మనేరాంపల్లె గ్రామానికి చెందిన కుస్తీ క్రీడాకారిణికి రూ.50 వేలు ఆర్థికసాయం టీడీపీ నాయకులు అందచేశారు. జాతీయస్థాయి కుస్తీ పోటీల్లో బంగారు పతకాన్ని సాధించిన హరిప్రియకు రూ.50 వేలు నగదు ఇస్తామని మైదుకూరు టీడీపీ ఇన్చార్జ్, టీటీడీ మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్యాదవ్ ప్రకటించారు. ఆయన అందచేసిన నగదును శనివారం మనేరాంపల్లె గ్రామంలో హరిప్రియ తల్లిదండ్రులకు దువ్వూరు మండల టీడీపీ ఇన్ఛార్జి బోరెడ్డి వెంకటరమణారెడ్డి, మిల్లు శ్రీను చేతుల మీదుగా తల్లిదండ్రులకు రూ.50 వేలు అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.