ఓటీపీ ఆధారంగా విత్తనాల పంపిణీ
ABN , First Publish Date - 2021-05-11T05:05:13+05:30 IST
రైతుల మొబైల్కు వచ్చే ఓటీపీ ఆధారంగా విత్తనాలు పంపిణీ చేస్తామని ఏవో ఎస్.అవినాష్ సోమవారం తెలిపారు.
సీతానగరం: రైతుల మొబైల్కు వచ్చే ఓటీపీ ఆధారంగా విత్తనాలు పంపిణీ చేస్తామని ఏవో ఎస్.అవినాష్ సోమవారం తెలిపారు. స్థానిక కార్యాలయంలో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ... రైతు భరోసా కేంద్రం ద్వారా ఖరీఫ్ సీజన్కు సబ్సిడీపై అందించే వరి విత్తనాలకు బయోమెట్రిక్ విధానం తొలగించారన్నారు. ఆయా గ్రామాల్లో అగ్రికల్చర్ సహాయకుల ద్వారా రైతుల మొబైల్ నెంబర్కు ఇకపై ఓటీపీ పంపి విత్తనాలు ఇస్తామని వెల్లడించారు. అన్నదాతల వేలిముద్ర వేయాల్సిన పనిలేదని తెలిపారు. ఈ విషయాన్ని రైతులు గమనించి గ్రామ వీఏఏ, వలంటీర్ సాయంతో విత్తనాలు తీసుకోవచ్చన్నారు. ఆయన వెంట గ్రామ వ్యవ సాయ సహాయకులు తదితరులు ఉన్నారు.