గిరిజనులకు టార్పాలిన్ల పంపిణీ
ABN , First Publish Date - 2021-07-26T07:10:13+05:30 IST
మండలంలోని కన్నాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని రాజులమడుగు గిరిజనులకు పోలీసుల ఆధ్వర్యంలో కేటాయించిన టార్పాలిన్లను ఐటీడీఏ ఏపీవో జనరల్ కినక భీంరావు, ఎస్సై సుబ్బారావు అందించారు.
ఉట్నూర్రూరల్, జూలై 25: మండలంలోని కన్నాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని రాజులమడుగు గిరిజనులకు పోలీసుల ఆధ్వర్యంలో కేటాయించిన టార్పాలిన్లను ఐటీడీఏ ఏపీవో జనరల్ కినక భీంరావు, ఎస్సై సుబ్బారావు అందించారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు కొలాం గిరిజనులకు వర్షాకాలంలో ఇబ్బందులు పడకుండా అందించామని ఎస్సై తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పెందూర్ జూగాదిరావు, గ్రామస్థులు ఉన్నారు.