పరిశ్రమల ఏర్పాటుతోనే ఉపాధి
ABN , First Publish Date - 2022-07-07T05:56:05+05:30 IST
పరిశ్రమ ఏర్పాటుతోనే ప్రజలకు ఉపాధి అవకాశాలు కలిగి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఆర్.వెంకట్రావు అన్నారు.
పెడన రూరల్ : పరిశ్రమ ఏర్పాటుతోనే ప్రజలకు ఉపాధి అవకాశాలు కలిగి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఆర్.వెంకట్రావు అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో పెడన, గూడూరు మండలాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం సబ్సిడీతో కూడిన రుణాల మం జూరుకు ఔత్సాహిక పారిశ్రామికులతో అవగాహనా సదస్సు నిర్వహించారు. వస్తువుల తయారీ, సేవా రంగాల ఏర్పాటుకు ఔత్సాహికులు ముం దుకు రావాలన్నారు. ఎస్సీ, ఎస్టీలకు కోటి రూపాయల వరకు, బీలకు రూ.75లక్షల వరకు, ఓసి మహిళలకు రూ.50 లక్షల వరకు సబ్సిడీ రుణాలు అందిస్తామన్నారు. వివిధ పరిశ్రహలకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఎంపీడీవో రామనాఽథరావు, రాజులపాటి అచ్యుతరావు, గొరిపర్తి రవికుమార్, డైరెక్టర్ విజయ్కుమార్, ఓఎస్డీ ఆదిరాజు పాల్గొన్నారు.