బెల్లంపల్లిలో కోర్టు భవన స్థలాన్ని పరిశీలించిన జడ్జి
ABN , First Publish Date - 2022-07-03T03:55:38+05:30 IST
కన్నాల శివారులోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు భవన నిర్మాణ స్థలాన్ని శనివారం జిల్లా జడ్జి సత్తయ్య పరిశీలించారు. ముందుగా కోర్టుకు వచ్చిన ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం న్యాయవాదులతో సమావేశమయ్యారు. భవన నిర్మాణానికి రూ. 4.32 కోట్లు, జడ్జి నివాస భవనానికి రూ. 89 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. న్యాయవాదుల నివాసాలకు స్థలాన్ని కేటాయించాలని వారు కోరారు.
బెల్లంపల్లి, జూలై 2 : కన్నాల శివారులోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు భవన నిర్మాణ స్థలాన్ని శనివారం జిల్లా జడ్జి సత్తయ్య పరిశీలించారు. ముందుగా కోర్టుకు వచ్చిన ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం న్యాయవాదులతో సమావేశమయ్యారు. భవన నిర్మాణానికి రూ. 4.32 కోట్లు, జడ్జి నివాస భవనానికి రూ. 89 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. న్యాయవాదుల నివాసాలకు స్థలాన్ని కేటాయించాలని వారు కోరారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి స్థలాన్ని కేటాయించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సత్తయ్యను సన్మానించి జ్ఞాపికను అందించారు. జడ్జి గొల్ల హిమబిందు, బార్ అసోసియేషన్ సభ్యులు, తహసీల్దార్ కుమారస్వామి, సీఐ బాబురావు, న్యాయవాదులు పాల్గొన్నారు.