29న ఒంగోలులో జిల్లా స్థాయి వైసీపీ ప్లీనరీ

ABN , First Publish Date - 2022-06-25T05:46:47+05:30 IST

వైసీపీ జిల్లా స్థాయి ప్లీనరీ ఈనెల 29వ తేదీన ఒంగోలులో నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, కనిగిరి ఎ మ్మెల్యే బుర్రా మధుసూదన్‌యాదవ్‌ తెలిపారు.

29న ఒంగోలులో జిల్లా స్థాయి వైసీపీ ప్లీనరీ


జిల్లా అధ్యక్షుడు, కనిగిరి ఎమ్మెల్యే బుర్రా


ఒంగోలు(కలెక్టరేట్‌), జూన్‌ 24 : వైసీపీ జిల్లా స్థాయి ప్లీనరీ ఈనెల 29వ తేదీన ఒంగోలులో నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, కనిగిరి ఎ మ్మెల్యే బుర్రా మధుసూదన్‌యాదవ్‌ తెలిపారు. స్థానిక వైసీపీ కార్యాలయం లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే నియోజకవర్గ స్థాయి ప్లీనరీలు జరుగుతున్నాయని చెప్పారు. కనిగిరి, దర్శి నియోజకవర్గ ప్లీనరీలు పూర్తి కాగా ఈనెల 26న కొం డపి, వైపాలెం, 27న మార్కాపురం, గిద్దలూరు, 28న సంతనూతలపాడు, ఒం గోలు నియోజకవర్గ ప్లీనరీలు జరుగుతాయన్నారు. జిల్లాస్థాయి ప్లీనరీలో ఎ మ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎంపీ పీలు, పార్టీలోని వివిధ హోదాల్లో ఉన్న శ్రేణులందరూ పాల్గొని విజయవం తం చేయాలని కోరారు. కార్యక్రమంలో మేయర్‌ గంగాడ సుజాత, ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, గంటా రామానాయుడు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-06-25T05:46:47+05:30 IST