జిల్లా ఓటర్లు 36,29,100
ABN , First Publish Date - 2021-01-16T05:44:38+05:30 IST
జిల్లా ఓటర్లు 36,29,100
మహిళలు 18,45,897, పురుషులు 17,82,915 మంది
విజయవాడ, ఆంధ్రజ్యోతి : జిల్లాలో తుది ఓటర్లు 36,29,100 మందిగా తేలారు. జనవరి 15 నాటికి నమోదైన తుది ఓటర్ల జాబితాను శుక్రవారం ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం మన జిల్లాలో 36,29,100 మంది ఓటర్లుగా తేలారు. కొత్తగా లక్షకు పైగా ఓటర్లు నమోదయ్యారు. ఈ దఫా కూడా మహిళా ఓటర్లదే హవా. జిల్లాలో 18,45,897 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 17,82,915 మంది పురుషులు ఉన్నారు. థర్డ్ జెండర్ ఓటర్లు 288 మంది. జిల్లాలో ఆర్మీలో పనిచేసే వారు 1,102 మంది సర్వీసు ఓటర్లుగా ఉన్నారు. వీరిలో 1,031 మంది పురుషులు కాగా, 71 మంది మహిళలు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో నాల్గో అత్యధిక ఓటర్లు ఉన్న జిల్లాగా కృష్ణా నమోదైంది. తూర్పు గోదావరి, గుంటూరు, విశాఖపట్నం తరువాత మన జిల్లా నిలిచింది.