కాకినాడలో దివీస్ మూడో యూనిట్
ABN , First Publish Date - 2020-12-02T06:22:24+05:30 IST
ఆంధ్రప్రదేశ్ కాకినాడ సమీపంలోని ఒంటిమామిడి గ్రామం వద్ద దివీస్ లేబొరేటరీస్ మూడో యూనిట్ను ఏర్పాటు చేస్తోంది. యూనిట్ నిర్మాణాన్ని డిసెంబరు 7న ప్రారంభించనున్నట్లు కంపెనీ తెలిపింది...
- రూ.1,500 కోట్ల పెట్టుబడులు
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఆంధ్రప్రదేశ్ కాకినాడ సమీపంలోని ఒంటిమామిడి గ్రామం వద్ద దివీస్ లేబొరేటరీస్ మూడో యూనిట్ను ఏర్పాటు చేస్తోంది. యూనిట్ నిర్మాణాన్ని డిసెంబరు 7న ప్రారంభించనున్నట్లు కంపెనీ తెలిపింది. మూడో యూనిట్ ఏర్పాటుకు దశల వారీగా దివీస్ ల్యాబ్స్ రూ.1,500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. యూనిట్ మొదటి దశలో ఔషధాల ఉత్పత్తి ఏడాది, ఏడాదిన్నరలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని పేర్కొంది.