బీసీ కార్పొరేషన నిధులు దారి మళ్లింపు

ABN , First Publish Date - 2021-12-02T05:43:55+05:30 IST

వెనుకబడిన బీసీ కులాలకు అందాల్సిన కార్పొరేషన నిధులు ప్రభుత్వం తమ స్వార్థం కోసం వాడుకుంటూ నిధులు పక్కదారి పట్టించిందని దీంతో బీసీ కులాలకు అందాల్సిన నిధులు దుర్వినియోగం అయ్యాయని వాటిని ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని వడ్డెర్ల కార్పొరేషన మాజీ చైర్మన దేవేళ్ల మురళి జిల్లా అధ్యక్షులు దళవాయి డిమాండ్‌ చేశారు.

బీసీ కార్పొరేషన నిధులు దారి మళ్లింపు
సమావేశంలో మాట్లాడుతున్న దేవేళ్ల మురళి, తదితరులు

- ప్రభుత్వంపై వడ్డెర్ల సంఘం నాయకుల ఫైర్‌

పెనుకొండ రూరల్‌, డిసెంబరు 1: వెనుకబడిన బీసీ కులాలకు అందాల్సిన కార్పొరేషన నిధులు ప్రభుత్వం తమ స్వార్థం కోసం వాడుకుంటూ నిధులు పక్కదారి పట్టించిందని దీంతో బీసీ కులాలకు అందాల్సిన నిధులు దుర్వినియోగం అయ్యాయని వాటిని ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని వడ్డెర్ల కార్పొరేషన మాజీ చైర్మన దేవేళ్ల మురళి జిల్లా అధ్యక్షులు దళవాయి డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా బుధవారం నూతనంగా ఎన్నుకోబడిన సందర్భంగా మండలంలో ఇస్లాపురంలో బీసీ వడ్డెర్ల సంఘం నాయకులు సమీక్షా సమావేశం నిర్వహించారు. అక్కడ ఏర్పాటుచేసిన సమావేశంలో దేవేళ్లమురళి, జిల్లా అధ్యక్షులు దళవాయి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వెనుకబడిన బీసీ కులాలకు  అందాల్సిన నిధులను ప్రభుత్వం తమ అవసరాలకు వాడుకుని నిధులను దుర్వినియోగం చేసిందన్నారు. దీంతో బీసీ కులాలు ఆర్థికంగా వెనుకబడ్డాయన్నారు. పేద ప్రజలకు అందాల్సిన కార్పొరేషన నిధులు అందించడంలో వైసీపీ ప్రభుత్వం వైఫల్యం చెందిందని వారు ఎద్దేవ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ శ్రీరాములు, వడ్డెర్ల సంఘం నాయకులు జిల్లా బోర్‌వెల్‌ అధ్యక్షులు మారెప్ప, ఉపాధ్యక్షుడు కాటమయ్య, బాల అంకన్న, హనుమంతు, శ్రీహరి, సుబ్బన్న, సురేష్‌, గుర్రప్ప, నాగరాజు, వెంకటేశు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-02T05:43:55+05:30 IST