పింఛన్‌ సొమ్ము దారి మళ్లింపు.. వలంటీర్‌ సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2020-08-09T11:35:19+05:30 IST

పింఛన్‌ సొమ్ము దుర్వినియోగానికి పాల్ప డిన వలంటీర్‌ పోలి అక్కింరెడ్డిని సస్పెండ్‌ చేసినట్టు మునిసిపల్‌ కమిషనర్‌ శ్రా వణ్‌కుమార్‌ ..

పింఛన్‌ సొమ్ము దారి మళ్లింపు.. వలంటీర్‌ సస్పెన్షన్‌

జంగారెడ్డిగూడెం టౌన్‌, ఆగస్టు 8 : పింఛన్‌ సొమ్ము దుర్వినియోగానికి పాల్ప డిన వలంటీర్‌ పోలి అక్కింరెడ్డిని సస్పెండ్‌ చేసినట్టు మునిసిపల్‌ కమిషనర్‌ శ్రా వణ్‌కుమార్‌ శనివారం తెలిపారు. రామచంద్రాపురం కాలనీ 9వ వార్డు సచివాలయ వలంటీర్‌ అక్కింరెడ్డి నలుగురు లబ్దిదారులకు చెందిన రూ.9వేల పింఛన్‌ను అంద జేయకుండా దొంగ లెక్కలు చూపాడన్నారు. దీనిపై విచారణ చేపట్టి వలంటీర్‌ను విధుల నుంచి తొలగించినట్టు తెలిపారు.  

Updated Date - 2020-08-09T11:35:19+05:30 IST