దైవ కార్యక్రమాలు విశ్వశాంతికి దోహదం

ABN , First Publish Date - 2021-10-17T05:08:27+05:30 IST

దైవ కార్యక్రమాలు విశ్వశాంతికి దోహదం

దైవ కార్యక్రమాలు విశ్వశాంతికి దోహదం
ముఖద్వారాన్ని ప్రారంభిస్తున్న మాజీ మంత్రి కృష్ణారావు, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌, ఎన్‌బీసీ సభ్యులు ఆచారి

  • మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు


తలకొండపల్లి : దైవ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు విశ్వశాంతికి దోహద పడతాయని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎన్‌బీసీ సభ్యుడు తల్లోజు ఆచారి, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌లు అన్నారు. మాజీ జడ్పీటీసీ సభ్యుడు పద్మ నర్సింహ, పద్మ స్వరూ దంపతుల ఆధ్వర్యంలో తలకొండపల్లి మండల కేంద్రంలోని లక్ష్మీనర్సింహస్వామి ఆలయం ఎదుట నూతనంగా నిర్మించిన ముఖ ద్వారాన్ని శనివారం వారు ప్రారంభించారు. అంతకు ముందు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ముఖ ద్వారా నిర్మాణ దాతలను ప్రజాప్రతినిధులు, నాయకులు అభినందించి సత్కరించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు గోలి శ్రీనివా్‌సరెడ్డి, జడ్పీ వైస్‌ చైర్మన్‌ బాలాజీసింగ్‌, కల్వకుర్తి మున్సిపల్‌ చైర్మన్‌ ఎడ్మ సత్యం, ఆమనగల్లు మార్కెట్‌ చైర్మన్‌ నాలాపురం శ్రీనివా్‌సరెడ్డి, సీఐ ఉపేందర్‌, ఎస్‌ఐ ఽవరప్రసాద్‌, కడ్తాల జడ్పీటీసీ దశరథ్‌ నాయక్‌, డీసీసీబీ డైరెక్టర్‌ గంప వెంకటేశ్‌, మండల రైతు సమన్వయ సమితి కో-ఆర్డినేటర్‌ ధశరథ్‌ నాయక్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శంకర్‌, మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌యాదవ్‌, సర్పంచ్‌ లలిత, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-17T05:08:27+05:30 IST