నిర్మానుష్య ప్రాంతంలో గొయ్యి తవ్వి.. 14 ఏళ్ల పిల్లాడిని మెడ వరకు పూడ్చేసి మరీ దారుణం.. ఏంటీ పనని తల్లిదండ్రులను అడిగితే..

ABN , First Publish Date - 2022-06-14T18:20:45+05:30 IST

సమాజం ఇంతగా అభివృద్ధి చెందిన తరుణంలో కూడా కొందరు మూఢనమ్మకాలనే పట్టుకుని వేలాడుతుంటారు.

నిర్మానుష్య ప్రాంతంలో గొయ్యి తవ్వి.. 14 ఏళ్ల పిల్లాడిని మెడ వరకు పూడ్చేసి మరీ దారుణం.. ఏంటీ పనని తల్లిదండ్రులను అడిగితే..

సమాజం ఇంతగా అభివృద్ధి చెందిన తరుణంలో కూడా కొందరు మూఢనమ్మకాలనే పట్టుకుని వేలాడుతుంటారు. వైద్య శాస్త్రాన్ని కాకుండా దొంగ బాబాలను నమ్మి మోసపోతుంటారు. వారు చెప్పే కఠినమైన చికిత్సలకు సిద్ధమవుతుంటారు. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్ ప్రాంతంలో ఒక బాబా మాటను నమ్మిన తల్లిదండ్రులు తమ కొడుకును 10 గంటల పాటు మట్టిలో కప్పి ఉంచారు. ఆ వీడియో బయటకు రావడంతో పోలీసులు రంగంలోకి దిగి ఆ బాలుడిని రక్షించారు. 


ఇది కూడా చదవండి..

ఇలాంటి తండ్రి మాకు అవసరం లేదంటూ 18 ఏళ్ల కుమార్తె ఆవేదన.. ఆమె ఎందుకు ఈ మాటలు అనాల్సి వచ్చిందంటే..


శ్రీగంగానగర్‌లోని సూరత్‌గఢ్‌‌కు చెందిన 14 ఏళ్ల చిన్నారి పుట్టినప్పటి నుంచే వికలాంగుడు. వికలాంగుడైన తమ బిడ్డను తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ఓ బాబా దగ్గరకు తీసుకెళ్లారు. చికిత్స పేరుతో ఆ బాబా చిన్నారిని మెడ నుంచి కింది భాగం మొత్తాన్ని ఓ నిర్మానుష్య ప్రాంతంలోని మట్టిలో పాతిపెట్టి వెళ్లిపోయారు. ఆ చిన్నారి ఒక్కడే బిక్కుబిక్కుమంటూ పది గంటల పాటు అలాగే ఉండిపోయాడు. ఆ ప్రాంతంలోకి వెళ్లిన కొందరు యువకులు మట్టిలో ఉన్న ఆ బాలుడిని వీడియో తీశారు. ఆ వీడియో పోలీసుల వరకు వెళ్లింది. 


వెంటనే స్పందించిన పోలీసులు బాబా బారి నుంచి ఆ చిన్నారిని రక్షించారు. చిన్నారిని మట్టిలోంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. కాగా, ఆ బాలుడిని 8 నెలల క్రితం తల్లిదండ్రులు చికిత్స కోసం అని చెప్పి ఆ బాబా దగ్గరే వదిలేసి వెళ్లిపోయారు. ఆ బాబా ఆ చిన్నారిని గతంలో కూడా ఇలా మట్టిలో కప్పి ఉంచినట్టు తెలుస్తోంది. ఆ బాబాను పోలీసులు అదపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. 

Updated Date - 2022-06-14T18:20:45+05:30 IST