Divyavani: బీజేపీలోకి దివ్యవాణి?
ABN , First Publish Date - 2022-09-08T18:39:10+05:30 IST
బీజేఎల్పీ నేత ఈటల రాజేందర్తో సినీనటి దివ్యవాణి భేటీ అయ్యారు.
హైదరాబాద్ (Hyderabad): బీజేఎల్పీ నేత ఈటల రాజేందర్ (Etala Rajendar)తో సినీనటి దివ్యవాణి (Divyavani) భేటీ అయ్యారు. ఇటీవల టీడీపీ (TDP)కి ఆమె రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈటలతో దివ్యవాణి భేటీపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఆమె బీజేపీ (BJP)లో చేరుతారా? చేరితో తెలంగాణ (Telangana)లో యాక్టీవ్గా ఉంటారా? అనే వాదన మొదలైంది. ఏపీ (AP)లో యాక్టివ్గా ఉండేటట్టయితే అక్కడ సోము వీర్రాజు (Somu Veerraju)ను కలిసేవారు కాదా? అనే వాదన కూడా వినిపిస్తోంది.
గురువారం ఉదయం హైదరాబాద్ శామీర్పేటలో ఉన్న ఈటల రాజేందర్ నివాసానికి వెళ్లిన దివ్యవాణి.. ఆయనతో భేటీ అయ్యారు. ఆమె త్వరలోనే బీజేపీలో చేరడానికి అంగీకరించినట్లు సమాచారం. అన్నీ కుదిరితే త్వరలోనే కాషాయ కండువా కప్పుకోనున్నారు. దివ్యవాణి ముఖ్యంగా తెలంగాణలో యాక్టీవ్గా ఉండేందుకు నిర్ణయించుకున్నట్లు తెలియవచ్చింది. 2019 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఆమె టీడీపీలో చేరారు. అధికార స్పోక్స్ పర్సన్గా పనిచేశారు. ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. అయితే మే నెలలో జరిగిన మహానాడులో జరిగిన ఓ సంఘటనతో దివ్యవాణి టీడీపీకి దూరమయ్యారు.