Telangana: KCR AND KTRపై డీకే అరుణ ఫైర్

ABN , First Publish Date - 2022-05-16T03:02:34+05:30 IST

బీజేసీ రాష్ట్ర నాయకురాలు డీకే అరుణ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌పై ఘాటు విమర్శలు చేశారు. అమిత్‌షా గురించి కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారని, బతుకుదెరువు

Telangana:  KCR AND KTRపై డీకే అరుణ ఫైర్

తెలంగాణ: బీజేసీ రాష్ట్ర నాయకురాలు డీకే అరుణ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌పై ఘాటు విమర్శలు చేశారు. అమిత్‌షా గురించి కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారని ఆరోపించారు. బతుకుదెరువు కోసం అమెరికాలో‌ ఉద్యోగం చేసిన కేటీఆర్‌తో నీతులు చెప్పించుకునే స్థితిలో తాము లేమన్నారు. తండ్రీకొడుకులు నీళ్లు, నిధులు, నియామకాలంటూ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం అధికారం చూసుకుని విర్రవీగుతుందన్నారు. కృష్ణా జలాల్లో 570 టీఎంసీలు రావాల్సివస్తే ఎందుకు 299 టీఎంసీలు ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. 2014 నుంచి 22వరకు రాష్ట్ర ప్రభుత్వం 69 వేల కోట్లు పెట్రోల్, డీజిల్ రూపంలో టాక్స్ వసూలు చేసిందని తెలిపారు. కేసీఆర్‌కు దమ్ముంటే కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలని సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు పరాభవం తప్పదన్నారు. తన ఫామ్ హౌస్‌కు నీళ్లు తరలించేందుకు ప్రాజెక్టుల పేరుతో కోట్ల అప్పు చేశారని ఆరోపించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను తమ పార్టీ నిజం చేస్తుందన్నారు డీకే అరుణ.  

Updated Date - 2022-05-16T03:02:34+05:30 IST