జోగుళాంబ సన్నిధిలో డీకే అరుణ

ABN , First Publish Date - 2022-10-01T05:14:28+05:30 IST

జోగుళాంబ అమ్మవారి సన్నిధిలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో శుక్రవారం బీజేపీ జాతీయ అధ్యక్షురాలు డీకే అరుణ శుక్రవారం పాల్గొన్నారు.

జోగుళాంబ సన్నిధిలో డీకే అరుణ
అమ్మవారి దర్శనానికి వస్తున్న డీకే అరుణ

    అలంపూర్‌, సెప్టెంబరు 30 : జోగుళాంబ అమ్మవారి సన్నిధిలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో శుక్రవారం బీజేపీ జాతీయ అధ్యక్షురాలు డీకే అరుణ శుక్రవారం పాల్గొన్నారు. అంతకుముందు ఆమెకు ఈవో పురేందర్‌, అర్చకులు సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. అనంతరం ఆమె బాలబ్రహ్మేశ్వర స్వామి, జోగుళాంబ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఆమె వెంట జిల్లా అద్యక్షుడు రామచంద్రారెడ్డి, గడ్డం కృష్ణారెడ్డి, బండల పద్మావతి, వెంకటేశ్వరరెడ్డి, రాజగోపాల్‌, జయశ్రీ, కబీర్‌దాస్‌, అనిత, సంజీవ్‌, నాగమద్దిలేటి, పిడుగు వెంకటేష్‌, నరసింహులు ఉన్నారు. 


అమ్మవారికి ప్రత్యేక పూజలు

గద్వాల : పట్టణంలోని మూడవ వార్డు హమాలీ కాలనీలో కొలువుదీరిన దుర్గామాత శుక్రవారం లలితా దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గొర్రెల కాపరుల సెల్‌ జిల్లా అధ్యక్షుడు కొండపల్లి రమేష్‌, అఖిల్‌రెడ్డి ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గడ్డం కృష్ణారెడ్డి, సీనియర్‌ నాయకుడు అయ్యపురెడ్డి, మునిసిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ రామాంజనేయులు, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రెడ్డి, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కబీర్‌దాస్‌ నర్సింహ, ఓబీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగేందర్‌యాదవ్‌, మునిసిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ అక్కల రమాదేవి, మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌ గౌడ్‌, మహిళా మోర్చా ఉపాధ్యాక్షురాలు భారతి, కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడు కొత్త గణేష్‌, పాండు, రంజిత్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-10-01T05:14:28+05:30 IST