డీఎల్‌ ఆస్తి వైఎస్‌ కుటుంబం పెట్టిన భిక్షే

ABN , First Publish Date - 2021-10-17T05:38:03+05:30 IST

డీఎల్‌ రవీంద్రారెడ్డి సంపాదించిన ఆస్తి వైఎస్‌ కుటుంబం పెట్టిన భిక్షే అని రాష్ట్ర వ్యవసాయ సలహాదారుడు అంబటి కృష్ణారెడ్డి విమర్శిచారు.

డీఎల్‌ ఆస్తి వైఎస్‌ కుటుంబం పెట్టిన భిక్షే

అంబటి కృష్ణారెడ్డి 

కడప (ఎర్రముక్కపల్లె), అక్టోబరు 16 : డీఎల్‌ రవీంద్రారెడ్డి సంపాదించిన ఆస్తి వైఎస్‌ కుటుంబం పెట్టిన భిక్షే అని రాష్ట్ర వ్యవసాయ సలహాదారుడు అంబటి కృష్ణారెడ్డి విమర్శిచారు. కడప వైసీపీ జిల్లా కార్యాలయంలో శనివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ రాజకీయ నాయకులు విమర్శలు చేయడం సర్వసాధారణమన్నారు. అయితే తనపై మైదుకూరు మాజీ ఎమ్మెల్యే డీఎల్‌ రవీంద్రారెడ్డి నీచంగా మాట్లాడటం దుర్మార్గమని తెలిపారు. 2019 ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించి రఘురామిరెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేశారని విమర్శించారు. ఈ విషయం తెలుసుకున్న జగన్‌  డీఎల్‌ను దూరం పెట్టారన్నారు. 2024 ఎన్నికల్లో డీఎల్‌ ఏ పార్టీ తరపున పోటీ చేసినా డిపాజిట్లు కూడా వచ్చే అవకాశం లేదన్నారు. ఈ సమావేశంలో చెన్నకేశవరెడ్డి, శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-17T05:38:03+05:30 IST