DL Ravindra Reddy: ఏపీలో ఇసుక, లిక్కర్ స్కామ్‌లపై సీబీఐ విచారణ చేయాలి..

ABN , First Publish Date - 2022-08-22T21:42:24+05:30 IST

ఏపీలో ఇసుక, లిక్కర్ స్కామ్‌లపై సీబీఐ విచారణ చేయాలని డీఎల్ రవీంధ్రారెడ్డి డిమాండ్ చేశారు.

DL Ravindra Reddy: ఏపీలో ఇసుక, లిక్కర్ స్కామ్‌లపై సీబీఐ విచారణ చేయాలి..

కడప జిల్లా (Kadapa): ఏపీ (AP)లో అవినీతి రాజ్యమేలుతోందని, ఇసుక (Sand), లిక్కర్ స్కామ్‌ (liquor scam)లపై సీబీఐ (CBI) విచారణ చేయాలని మాజీమంత్రి డీఎల్ రవీంధ్రారెడ్డి (Ravindra Reddy) డిమాండ్ చేశారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం (Jagan Govt.) వారి స్వలాభం కోసం పనికిరాని లిక్కర్ బ్రాండ్లను తయారు చేసి ప్రజలను అనారోగ్యం పాలు చేస్తున్నారని ఆరోపించారు. అవినీతి విషయంలో ప్రధాన మంత్రి మోదీ  మచ్చలేని వ్యక్తి.. అయితే అవినీతి పరులను దరిచేరనివ్వద్దని నీతులు చెప్పి.. ఆయనే అవినీతి పరులను దగ్గరకు చేర్చుకుంటున్నారని విమర్శించారు. అవినీతిని అంతం చేయాలంటే.. పీఎం మోదీ (PM Modi) అవినీతి ముఖ్యమంత్రులు, మంత్రులను దగ్గరకు రానివ్వకూడదన్నారు. ఇప్పటికైనా అవినీతిపరులను ప్రధానమంత్రి దూరం పెట్టాలని రవీంధ్రారెడ్డి అన్నారు.

Updated Date - 2022-08-22T21:42:24+05:30 IST