రికార్డులు తనిఖీ చేస్తున్న డీఎల్పీవో రమేష్
ఉదయగిరి రూరల్, జనవరి 21: పంచాయతీ కార్యదర్శులు వారి పరిధిలోని పంచాయతీల్లో అన్ని రకాల పన్నుల వసూలును నూరు శాతం పూర్తి చేయాలని కావలి డీఎల్పీవో రమేష్ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని కొండాయపాళెం, తిరుమలాపురం పంచాయతీ కార్యాలయాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సంబంధిత రికార్డులు తనిఖీ చేసి సిబ్బందికి తగు సూచనలు, సలహాలు అందజేశారు. గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుకు చర్యలు తీసుకోవడంతోపాటు కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డీ శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శులు అమర్నాధ్రెడ్డి, సుధాకర్, నాగూర్బీ, సర్పంచు కె.కృష్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.