స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలి: డీఎల్పీవో
ABN , First Publish Date - 2021-06-17T04:24:43+05:30 IST
వచ్చేనెల 8వ తేదీ నుంచి నిర్వహించనున్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని అధికారులు, సర్పంచులు బాధ్యతగా తీసుకుని గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపరిచి
ఆత్మకూరు, జూన్ 16 : వచ్చేనెల 8వ తేదీ నుంచి నిర్వహించనున్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని అధికారులు, సర్పంచులు బాధ్యతగా తీసుకుని గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపరిచి స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలని నెల్లూరు డివిజన్ డీఎల్పీవో కె.కృష్ణమోహన్ సూచించారు. బుధవా రం ఆయన మురగళ్లలోని ఎస్డబ్ల్యూపీసీని సందర్శించి శానిటేషన్ కార్యక్రమంలో జరిగే తీరుతెన్నులను పరిశీలించి సూచనలిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచు పి.హరిత, ఈవోపీఆర్డీ సీ శ్రీనివాసులు, పంచాయతీ కార్యదర్శి పి.భాస్కర్రావు పాల్గొన్నారు.