మాతృ మరణాలను వీలైనంతగా తగ్గించాలి
ABN , First Publish Date - 2021-06-18T05:51:21+05:30 IST
జిల్లాలో మాతృ మరణాలను వీలైనంతగా తగ్గించాలని డీఎంహెచ్వో డాక్టర్ యాస్మిన్ తెలిపారు. జిల్లా మాతృమరణాల కమిటీ సమీక్ష గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జరిగింది
గుంటూరు(సంగడిగుంట): జిల్లాలో మాతృ మరణాలను వీలైనంతగా తగ్గించాలని డీఎంహెచ్వో డాక్టర్ యాస్మిన్ తెలిపారు. జిల్లా మాతృమరణాల కమిటీ సమీక్ష గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఈ ఏడాది మార్చి నుంచి మే వరకు జిల్లాలో 12 మాతృ మరణాలు సంభవించినట్లు గుర్తించారు. వీటిలో రెండు సౌకర్యాలు లేని కారణంగాను, మిగిలిన పది యాధృచ్ఛికంగా జరిగినట్లు కమిటీ సభ్యులు నిర్ధారణకు వచ్చారు. ఇకపై సౌకర్యాల లేమి కారణంగా మాతృ మరణాలు సంభవించకుండా ఎఎన్ఎంలు, ఆశా వర్కర్లను, పారామెడికల్ సిబ్బందిని అప్రమత్తం చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులైన ఏడీఎంహెచ్వో డాక్టర్ జయసింహ, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ సుస్మిత, డాక్టర్ వెంకటేశ్వరరావు, డాక్టర్ సుధారాణి, డాక్టర్ రాధికారాయుడు తదితరులు పాల్గొన్నారు.