48 డెంగీ, 5 మలేరియా కేసులు నమోదు
ABN , First Publish Date - 2021-02-28T05:36:22+05:30 IST
జిల్లాలో జనవరి, ఫిబ్రవరి మాసాల్లో 5 మలేరియా, 48 డెంగీ ఫీవర్ కేసులు నమోదైనట్లు ఈఎంహెచ్వో డాక్టర్ జొన్నలగడ్డ యాస్మిన్ తెలిపారు.
డీఎంహెచ్వో యాస్మిన్ వెల్లడి
గుంటూరు (మెడికల్), ఫిబ్రవరి 27: జిల్లాలో జనవరి, ఫిబ్రవరి మాసాల్లో 5 మలేరియా, 48 డెంగీ ఫీవర్ కేసులు నమోదైనట్లు ఈఎంహెచ్వో డాక్టర్ జొన్నలగడ్డ యాస్మిన్ తెలిపారు. శనివారం తన ఛాంబర్లో జరిగిన మలేరియా సబ్ యూనిట్ అధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మలేరియా, డెంగ్యూ కేసులు నమోదైన ప్రాంతాల్లో సర్వెలెన్స్ నిర్వహించి కొత్త కేసులు నమోదు కాకుండా తగిన నివారణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా శాఖాధికారి ఏ జ్ఞానశ్రీ తదితరులు పాల్గొన్నారు. రక్తహీనత నివారణలో భాగంగా ఆరు నెలల నుంచి ఐదేళ్లలోపు వయస్సు కలిగిన చిన్నారులకు ఐరన్ ద్రావణం పంపిణి చేయాలని అడిషనల్ డీఎంహెచ్వో డాక్టర్ జయసింహ ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మీటింగ్హాల్లో సామాజిక ఆరోగ్య అధికారులు, బహుళార్ధక ఆరోగ్య విస్తరణాఽధికారుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. పాఠశాల పిల్లలకు ప్రతి గురువారం ఐరన్ మాత్రలు అందజేయాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఆర్బీఎస్కే కోఆర్డినేటర్ డాక్టర్ జీ చంద్రశేఖర్, పీవో డీటీటీ డాక్టర్ పద్మావతి, గణాంకాధికారి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.