నీట్ పరీక్ష రద్దు అంశంపై కేటీఆర్‌‌ను కలిశాం: డీఎంకే ఎంపీ

ABN , First Publish Date - 2021-10-13T17:20:37+05:30 IST

నీట్ పరీక్ష రద్దు అంశంపై మంత్రి కేటీఆర్‌ను కలిశామని డీఎంకే ఎంపీ ఎలోన్గోవన్ తెలిపారు.

నీట్ పరీక్ష రద్దు అంశంపై కేటీఆర్‌‌ను కలిశాం: డీఎంకే ఎంపీ

హైదరాబాద్: నీట్ పరీక్ష రద్దు అంశంపై మంత్రి కేటీఆర్‌ను కలిశామని డీఎంకే ఎంపీ ఎలోన్గోవన్ తెలిపారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని నీట్ పరీక్ష అంశంపై తాము నిర్ణయం తీసుకున్నామన్నారు. కేంద్ర విధానంపై తామునిరసన చేస్తున్నామని...తమకు మద్దతు తెలపాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆడిగామని చెప్పారు. కేంద్రం కీలకమైన విషయాలలో రాష్ట్రాల అభిప్రాయం తీసుకోవడం లేదన్నారు. 


టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ...డీఎంకే  ఎంపీలు కేటీఆర్ ను కలిశారన్నారు. లెటర్ తీసుకొచ్చి కేటీఆర్‌కు స్వయంగా అందించి మద్దతు అడిగినట్లు తెలిపారు. నీట్ పరీక్ష రద్దు అంశంపై ఇప్పటికే తమిళనాడు సీఎం స్టాలిన్ కేసీఆర్‌కు లేఖ రాశారని అన్నారు. 

Updated Date - 2021-10-13T17:20:37+05:30 IST