తమిళనాడు మున్సిపల్ ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థుల ముందంజ

ABN , First Publish Date - 2022-02-22T16:57:05+05:30 IST

తమిళనాడు రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార డీఎంకే అభ్యర్థులు విజయం వైపు దూసుకుపోతున్నారు...

తమిళనాడు మున్సిపల్ ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థుల ముందంజ

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార డీఎంకే అభ్యర్థులు విజయం వైపు దూసుకుపోతున్నారు.గ్రేటర్ చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 5 వార్డుల్లో డీఎంకే అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు.రాష్ట్రంలోని మధురై, కోయంబత్తూర్, సేలం మున్సిపాలిటీల్లోనూ డీఎంకే అభ్యర్థులే ముందంజలో ఉన్నారు.చెన్నై గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మరో ఆరు స్థానాల్లో డీఎంకే అభ్యర్థులే ముందున్నారు.కోయంబత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ లో 3 వార్డుల్లో డీఎంకే అభ్యర్థులు విజయపథాన దూసుకుపోతున్నారు.



మధురై మున్సిపాలిటీలోని ఏడు వార్డుల్లో డీఎంకే, ఒక స్థానంలో ఏఐడీఎంకే అభ్యర్థులు ముందున్నారు.సేలం మున్సిపాలిటీలో 60 వార్డులుండగా మూడు వార్డుల్లో డీఎంకే అభ్యర్థులు ఆధిక్యతలో ఉన్నారు. పుదుకొట్టాయ్ పట్టణంలో ఒక వార్డును విజయ్ మక్కల్ ల్యాక్కం పార్టీ అభ్యర్థి విజయం సాధించారు.భారీ సాయుధ పోలీసుల బందోబస్తు మధ్య మున్సిపల్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 

Updated Date - 2022-02-22T16:57:05+05:30 IST