దళితులకు న్యాయం చేయండి

ABN , First Publish Date - 2021-07-28T04:59:58+05:30 IST

మండలంలోని తిమ్మాపురం గ్రామంలో దళితుల భూములను కొందరు ఆక్రమించుకున్నారని వారి నుంచి భూములను దళితులకు అందేలా న్యాయం చేయాలని ఏపీ దళిత సమాఖ్య జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి యల్లయ్యమాదిగ కోరారు.

దళితులకు న్యాయం చేయండి
ధర్నా చేస్తున్న దళిత సమాఖ్య నేతలు

ముద్దనూరు, జూలై27: మండలంలోని తిమ్మాపురం గ్రామంలో దళితుల భూములను కొందరు ఆక్రమించుకున్నారని  వారి నుంచి భూములను దళితులకు అందేలా న్యాయం చేయాలని ఏపీ దళిత సమాఖ్య జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి యల్లయ్యమాదిగ కోరారు. మంగళవారం ఏపీ దళిత సమాఖ్య ఆధ్వర్యంలో తహసీల్దారు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  దళితుడు జంగాల నాగన్నకు 1985లో  అప్ప టి ప్రభుత్వం 2.89 ఎకరాల భూమిని  మంజూరు చేయగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారన్నారు. కాగానాగన్న భూమిని కొత్తపల్లె సూర్యనారాయణరెడ్డి అనే వ్యక్తి  ఆక్రమించుకున్నారని  అతని పై చట్టపరమైన చర్యలుతీసుకొని న్యా యం చేయాలని డిమాండ్‌ చేశారు. ఏపీ దళిత సమాఖ్య మండల కన్వీనర్‌  మునిక్రిష్ణ, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-28T04:59:58+05:30 IST