బాధితులకు న్యాయం చేయండి : ఎస్పీ

ABN , First Publish Date - 2021-08-03T04:47:12+05:30 IST

స్పం దన కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులను నిర్ణీత సమయంలోగా విచారించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ సిబ్బందిని ఆదేశించారు.

బాధితులకు న్యాయం చేయండి : ఎస్పీ
బాధితురాలి సమస్య తెలుసుకుంటున్న ఎస్పీ

కడప(క్రైం), ఆగస్టు 2: స్పం దన కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులను నిర్ణీత సమయంలోగా విచారించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ సిబ్బందిని ఆదేశించారు. జిల్లా పోలీ సు కార్యాలయంలో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో ఎస్పీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఫిర్యాదును పరిశీలించి బాధితులకు న్యాయం చేసినప్పుడే ప్రజల్లో పో లీసు శాఖపై నమ్మకం, గౌరవం పెరుగుతుందన్నారు. సివిల్‌ పంచాయతీలు పరిష్కరించకూడదని, రైతులు, మహిళలు, వృద్ధుల ఫిర్యాదులపై సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా కేంద్రానికి రాలేని వారికి ఫిర్యాదులను సచివాలయంలోని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వారి సమస్యలు అడిగి తెలుసుకుని సంబంధిత పోలీసు అధికారులకు పరిష్కరించాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - 2021-08-03T04:47:12+05:30 IST