అధైర్య పడకండి.. అండగా ఉంటాం..
ABN , First Publish Date - 2021-07-24T06:22:05+05:30 IST
టీ డీపీ నాయకులు, కార్యకర్తలకు పార్టీ ఎళ్లవేళలా అండగా ఉంటుందని మా జీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొ న్నారు.
మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి
పుట్టపర్తిరూరల్, జులై 23: టీ డీపీ నాయకులు, కార్యకర్తలకు పార్టీ ఎళ్లవేళలా అండగా ఉంటుందని మా జీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొ న్నారు. మండల పరిధిలోని ఆమగొం డపాలెం టీడీపీ నాయకుడు, మాజీ డీలర్ ప్రభాకర్ మృతిచెందిన విష యం తెలుసుకున్న ఆయన శుక్ర వా రం ఆ గ్రామానికి చేరుకుని మృత దేహానికి పూలమాలలు వేసి, నివా ళులు ఆర్పించారు. అనంతరం కుటుం బ సభ్యులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని పార్టీ అన్నివిధాల సహా య సహకా రాలు అందిస్తుందని భరోసానిచ్చారు. అదేవిధంగా గ్రామంలో ఇటీవల మరణిం చిన టీడీపీ నాయకులు నారాయణప్ప, వెంకటేష్ కుటుంబ సభ్యులను పరామ ర్శించారు. ఆ కుటుంబాలకు ఆర్ఘికసాయం అందచేశారు. కార్యక్రమంలో మం డలపార్టీ కన్వీనర్ విజయ్కుమార్ శ్రీరాంరెడ్డి గూడూరు ఓబులేసు పెడపల్లి శ్రీరాంనాయక్ తదితరులు పాల్గొన్నారు.