కేసీఆర్ను మళ్లీ మళ్లీ నమ్మి మోసపోవద్దు: షర్మిల
ABN , First Publish Date - 2022-05-29T17:31:05+05:30 IST
కేసీఆర్ను మళ్లీ మళ్లీ నమ్మి మోసపోవద్దు: షర్మిల
ఖమ్మం: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. సదాశివునిపేటలో రైతుగోస ధర్నాలో షర్మిల పాల్గొన్నారు. యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని, పంట వేయని రైతులకు ఎకరాకు 25 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ మోసం చేయని వర్గం లేదని, దొంగ హామీలు ఇచ్చేందుకు మళ్లీ రెడీ అవుతున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ను మళ్లీ మళ్లీ నమ్మి మోసపోవద్దని షర్మిల ప్రజలకు సూచించారు.