మహారాష్ట్ర నుంచి ప్రయాణికులను తీసుకు రావొద్దు: ఎస్సై

ABN , First Publish Date - 2021-04-23T05:17:53+05:30 IST

మహారాష్ట్ర నుంచి ప్రయాణికులకు మండలానికి తీసు కుని రావద్దని ఆటో డ్రైవర్లకు ఎస్సై రాజు సూచించారు.

మహారాష్ట్ర నుంచి ప్రయాణికులను తీసుకు రావొద్దు: ఎస్సై

మద్నూర్‌, జనవరి 22: మహారాష్ట్ర నుంచి ప్రయాణికులకు మండలానికి తీసు కుని రావద్దని ఆటో డ్రైవర్లకు ఎస్సై రాజు సూచించారు. కొవిడ్‌ దృష్ట్యా మహా రాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్నాయని, దీంతో సరిహద్దు గ్రామాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయన్నారు. ముందుజాగ్రత్తగా ఆటోడ్రైవర్లకు సూచించారు. మండల ప్రజలు మహారాష్ట్రకు వెళ్లకుండా, అక్కడి ప్రజలు ఇక్కడికి రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కొవిడ్‌ నిబంధనలు పాటించాలన్నారు.

Updated Date - 2021-04-23T05:17:53+05:30 IST