క్షణికావేశంతో నేరాలకు పాల్పడొద్దు
ABN , First Publish Date - 2021-10-25T05:19:14+05:30 IST
క్షణికావేశంతో నేరాలకు పాల్పడొద్దు
యాచారం: పరస్పరం కేసులు పెట్టుకున్న వారు రాజీమార్గంతో కేసులను పరిష్కరించుకోవాలని, తద్వారా ఇ ద్దరికీ మేలేననే విషయం గుర్తుంచుకోవాలని ఇబ్రహీంప ట్నం కోర్టు అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అనామిక అన్నారు. ఆదివారం ధర్మన్నగూడలో ఏర్పాటు చేసిన న్యా యసేవలపై అవగాహన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఎలాంటి త గాదాలున్నా ఇరు పార్టీలు కూర్చొని పరిష్కరించుకోవాలన్నారు. న్యాయవాదులను నియమించుకోలేని పేదల కు రాష్ట్ర ఉన్నత న్యాయస్తానం ఉచితంగా న్యాయవాదిని సమకూరుస్తుందని తెలిపారు. క్షణికావేశంతో నే రాలకు పాల్పడరాదని. ఏ పని చేస్తున్నా ఒకటికి రెం డు సార్లు ఆలోచించి పనులు చేసుకోవాలన్నారు. నేరాల కు పాల్పడితే జీవితంలో ఓ మచ్చ మిగలడంతో పాటు డ బ్బు, సమయం వృథా అవుతాయన్నారు. మానసికంగా దె బ్బతింటారనే చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ బాషయ్య, ఉపసర్పంచ్ పాండుచారి. ఎస్సై పద్మయ్య, న్యావాదులు ఎం.వెంకటేష్, అంజన్రెడ్డి, మాదన్న పాల్గొన్నారు.