ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు
ABN , First Publish Date - 2021-09-19T05:17:40+05:30 IST
ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా 18సంవత్సరాలు పైబడిన ప్రతీ ఒక్కరు కొవిడ్ వ్యాక్సిన్ తప్పక వేయించుకోవాలని కలెక్టర్ వ ల్లూరు క్రాంతి అన్నారు.
- కలెక్టర్ వల్లూరు క్రాంతి
- జిల్లా కేంద్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కేంద్రాల తనిఖీ
గద్వాల క్రైం, సెప్టెంబరు 18: ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా 18సంవత్సరాలు పైబడిన ప్రతీ ఒక్కరు కొవిడ్ వ్యాక్సిన్ తప్పక వేయించుకోవాలని కలెక్టర్ వ ల్లూరు క్రాంతి అన్నారు. శనివారం పట్టణంలోని ప్రాక్టిసింగ్, ఇండోఇంగ్లీష్ పాఠశాలలతో పాటు గంజిపేట ప్రాంతంలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ వ్యాక్సిన్ విషయంలో ఎవరు భయాందోళన కు గురికాకుండా అందరు వేసుకోవాలన్నారు. వ్యాక్సిన్ వేసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటారన్నారు. వార్డుల వారి గా 18సంవత్సరాలు పైబడిన వారు ఎంతమంది ఉ న్నారు.. ఎంతమంది వ్యాక్సిన్ వేసుకున్నారు.. ఇంకా ఎం తమంది వేయించుకోలేదని ఆరా తీశారు. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారుల ను ఆదేశించారు. కార్యక్రమంలో మార్కెట్యార్డ్ చైర్పర్సన్ రామేశ్వరమ్మ, డీఎంహెచ్వో డాక్టర్ చందూనాయ క్, అధికారులు, నాయకులు ఉన్నారు.