‘విధుల్లో నిర్లక్ష్యం వద్దు’

ABN , First Publish Date - 2022-05-27T05:50:58+05:30 IST

విధులపై నిర్లక్ష్యం వహించవద్దని శ్రీశైలం ఐటీడీఏ పీవో రవీంద్రారెడ్డి అన్నారు. గురువారం ఆయన మండలంలోని బోయరేవుల, మోత్కూరు గ్రామాల్లోని సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

‘విధుల్లో నిర్లక్ష్యం వద్దు’
మోత్కూరులో మొబైల్‌ యాప్‌లో వివరాలను పరిశీలిస్తున్న అధికారి

వెలుగోడు, మే 26: విధులపై నిర్లక్ష్యం వహించవద్దని శ్రీశైలం ఐటీడీఏ పీవో రవీంద్రారెడ్డి అన్నారు. గురువారం ఆయన మండలంలోని బోయరేవుల, మోత్కూరు గ్రామాల్లోని సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా కార్యాలయ రికార్డులను తనిఖీ చేసి సిబ్బంది పనితీరు గురించి ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులు తప్పనిసరిగా సమయపాలన పాటించాలని ఆదేశించారు. అదేవిధంగా స్పందన వినతులను త్వరితగతిన పరిష్కరించాలని, వారాం తపు సమావేశాలను తప్పక నిర్వహించాలని ఆదేశించారు. అదేవిధంగా అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు నాగరాజు, చౌడయ్య, సిబ్బంది ఉన్నారు. 


Updated Date - 2022-05-27T05:50:58+05:30 IST