ఎస్‌ఐ మరణాన్ని రాజకీయం చేయొద్దు

ABN , First Publish Date - 2021-01-22T09:14:36+05:30 IST

గుడివాడ ఎస్‌ఐ పి.విజయ్‌కుమార్‌ ఆత్మహత్యను రాజకీయాల కోసం వాడుకోవడం గర్హనీయమని ఏపీ పోలీస్‌ అధికారుల సంఘం ఖండించింది.

ఎస్‌ఐ మరణాన్ని రాజకీయం చేయొద్దు

అచ్చెన్న బెదిరింపులకు భయపడం: పోలీస్‌ అధికారుల సంఘం


విజయవాడ సిటీ, జనవరి 21: గుడివాడ ఎస్‌ఐ పి.విజయ్‌కుమార్‌ ఆత్మహత్యను రాజకీయాల కోసం వాడుకోవడం గర్హనీయమని ఏపీ పోలీస్‌ అధికారుల సంఘం ఖండించింది. సంఘం అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు జె.శ్రీనివాసరావు, ఎండీ మస్తాన్‌ఖాన్‌ తదితరులు గురువారం విజయవాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పేకాట శిబిరాలపై దాడుల నేపథ్యంలో ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడంటూ చంద్రబాబు దర్యాప్తును పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నించడం విచారకమన్నారు. ఇటువంటివి పునరావృతమైతే న్యాయపోరాటం చేయడానికి సంఘం వెనుకాడబోదన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవ్వరినీ వదలబోమని, రిటైర్‌ అయినా ఇంటికి వచ్చి వారి పనిచూస్తామని అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆయన బెదిరింపులకు పోలీసులు భయపడరన్నారు. అచ్చెన్నాయుడుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. 

Updated Date - 2021-01-22T09:14:36+05:30 IST