దామగుండంలో రాడార్‌ కేంద్రం వద్దు

ABN , First Publish Date - 2021-03-09T06:08:38+05:30 IST

దామగుండంలో రాడార్‌ కేంద్రం వద్దు

దామగుండంలో రాడార్‌ కేంద్రం వద్దు
జిల్లా అటవీశాఖ ఎదుట ధర్నాచేస్తున్న పూడూరు మండల ప్రజలు

వికారాబాద్‌: రాడార్‌ కేంద్రాన్ని వికారాబాద్‌ జిల్లాలోని దామగుండంలో నెలకొల్పవద్దని పూడూరు మండల గ్రామస్థులు తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జిల్లా అటవీశాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఈవిషయంపై స్పందించాలని లేదంటే మరో ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. అనంతరం జిల్లా అటవీశాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈకార్యక్రమంలో శంకరన్న, రత్నమ్మ, సుజాత, సత్యమ్మ, నీలమ్మ, అనంతరాములు, అనిల్‌, చంద్రశేఖర్‌ ఉన్నారు. 


Updated Date - 2021-03-09T06:08:38+05:30 IST