ఇక్కడే శస్త్రచికిత్సలు చేయండి
ABN , First Publish Date - 2021-04-18T05:01:39+05:30 IST
వరి బీజం వ్యాధితో బాధ పడేవారిని గుర్తించి ఆత్మకూరులోనే శస్త్ర చికిత్సలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా మలేరియా అధికారి నూకరాజు వైద్యాధికారులను ఆదేశించారు.
జిల్లా మలేరియా అధికారి నూకరాజు
ఆత్మకూరు
రూరల్, ఏప్రిల్ 17: వరి బీజం వ్యాధితో బాధ పడేవారిని గుర్తించి
ఆత్మకూరులోనే శస్త్ర చికిత్సలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా
మలేరియా అధికారి నూకరాజు వైద్యాధికారులను ఆదేశించారు. శనివారం మండలంలోని
బాపనంతాపురం, ముష్ట్టెపల్లి, నల్లకాలువ, పెద్దఅనంతాపురం గ్రామాల్లో
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయన వరిబీజం వ్యాధితో బాధ పడే బాధితులను కలిసి
వారిని శస్త్ర చికిత్సలు చేయించుకోవాలని సూచించారు. ఈ మేరకు ఆత్మకూరులోనే
ఆరోగ్య శ్రీ కింద శస్త్ర చికిత్సలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు
చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. అనంతరం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో
ఎంపీడీవో మోహన్కుమార్ను కలిసి గ్రామాల్లో మలేరియా, డెంగ్యూ తదితర సీజనల్
వ్యాధులు వ్యాప్తి చెందకుండా పారిశుధ్య పనులు చేపట్టాలని సూచించారు.
ఆయన వెంట వైద్యాధికారి పవన్కుమార్, మలేరియా సబ్ యూనిట్ అధికారి సాలయ్య,
సీహెచ్వో బస్తిపాటి మౌలాలి, ఈసీ భాస్కర్ ఉన్నారు.