9వ డివిజన్‌ సమస్యలు పట్టించుకోరా..?

ABN , First Publish Date - 2021-11-26T05:21:26+05:30 IST

ఒంగో లు కార్పొరేషన్‌ పరిధిలోని 9వ డివిజన్‌లో గల స మస్యలను పరిష్కరించాలంటూ స్థానికులు డిమా ండ్‌ చేశారు. నగరంలోని జర్నలిస్ట్‌కాలనీ, ఎన్టీఆ ర్‌కాలనీ, రాజీవ్‌ గృహకల్పలో రోడ్లు, డ్రైన్లు నిర్మిం చాలని ధర్నా నిర్వహించారు.

9వ డివిజన్‌ సమస్యలు పట్టించుకోరా..?
నిరసన వ్యక్తం చేస్తున్న పలు కాలనీలవాసులు

రోడ్లు, కాలువలు నిర్మించాలంటూ మహిళల నిరసన 


ఒంగోలు(కార్పొరేషన్‌), నవంబరు 25 : ఒంగో లు కార్పొరేషన్‌ పరిధిలోని 9వ డివిజన్‌లో గల స మస్యలను పరిష్కరించాలంటూ స్థానికులు డిమా ండ్‌ చేశారు. నగరంలోని జర్నలిస్ట్‌కాలనీ, ఎన్టీఆ ర్‌కాలనీ, రాజీవ్‌ గృహకల్పలో రోడ్లు, డ్రైన్లు నిర్మిం చాలని ధర్నా నిర్వహించారు. గురువారం కాలనీ లోని అధ్వానంగా ఉన్న రోడ్లపైకి చేరి నిరసన తె లిపారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడు తూ కొద్దిపాటి వర్షానికే కాలనీల్లోని రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతోపాటు, సైడు కాలవలు లేక మురుగునీరు ఏకమై రాకపోకలకు తీవ్ర ఇబ్బందు లు పడుతున్నట్లు చెప్పారు. కనీసం కాలినడక కూడా కష్టంగా మారిందని వాపోయారు. సైడు కాలువలు లేక ఇళ్ల మధ్య మురుగు నిలుస్తోంద ని, చిల్లచెట్లు పెరిగి విష పురుగులు సంచరిస్తు న్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత ఇరవై అ యిదురోజులుగా కురుస్తున్న వర్షాకు కాలనీల్లో ప రిస్థితి మరింత దారుణంగా ఉందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించా లని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా సీపీఎం న గర కమిటీ ఆధ్వర్యంలోనూ ఆయా కాలనీల్లో మౌ లిక వసతులు కల్పించాలని నిరసన ప్రదర్శన ని ర్వహించి అధికారుల నిర్లక్ష్యంపై ధ్వజమెత్తారు. 


Updated Date - 2021-11-26T05:21:26+05:30 IST