కౌలు రైతులకు రైతుబంధు ఇవ్వరా?

ABN , First Publish Date - 2022-08-13T10:07:31+05:30 IST

రాష్ట్రంలోని కౌలు రైతులకు రైతు బంధు డబ్బులు ఎందుకు ఇవ్వరని వైఎ్‌సఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు.

కౌలు రైతులకు రైతుబంధు ఇవ్వరా?

కుటుంబ పాలనను తరిమికొట్టే రోజులొస్తాయి: షర్మిల

దౌల్తాబాద్‌/కొడంగల్‌ రూరల్‌, ఆగస్టు 12: రాష్ట్రంలోని కౌలు రైతులకు రైతు బంధు డబ్బులు ఎందుకు ఇవ్వరని వైఎ్‌సఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు. వైఎస్సార్‌ హయాంలో రైతులకు అమలు చేసిన వివిధ సంక్షేమ పథకాలను రద్దు చేసి.. రైతులకు కేవలం రూ.5 వేలు ఇస్తారా? అని మండిపడ్డారు. షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర 120వ రోజు శుక్రవారం వికారాబాద్‌ జిల్లా దౌల్తాబాద్‌ మండలంలో కొనసాగింది. దౌల్తాబాద్‌లో మహిళలు, ప్రజలతో మాట-ముచ్చట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ది దగాకోరు పాలన అని, ఎనిమిదేళ్లుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న ఆయన ప్రతీ వర్గాన్ని మోసం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన కొనసాగుతోందని, తెలంగాణలో అసలు మాట మీద నిలబడే నాయకుడే లేడన్నారు. ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు నిద్రపోతున్నాయని విమర్శించారు. 

Updated Date - 2022-08-13T10:07:31+05:30 IST