మీ బాగోతం తేలుస్తా
ABN , First Publish Date - 2021-07-27T07:23:39+05:30 IST
‘విజయసాయీ... నాపై, నా కంపెనీలపై అసత్య ఆరోపణలతో
- 15 కేసులు ఉంటే విదేశాలకు ఎలా వెళ్తావు
- సీఎం జగన్పై 17 నుంచి 20 చార్జిషీట్లు
- సీఎం, విజయసాయిపై రఘురామ ధ్వజం
న్యూఢిల్లీ, జూలై 26(ఆంధ్రజ్యోతి): ‘విజయసాయీ... నాపై, నా కంపెనీలపై అసత్య ఆరోపణలతో ప్రధానికి ఫిర్యాదు చేస్తావా? చార్టెడ్ అకౌంటెంట్గా మొదలు పెట్టినప్పటి నుంచి నువ్వేంటో, నీ సూట్కేసు కంపెనీల అవినీతి బాగోతమేంటో తేలుస్తా. నువ్వు, ఏ-1 జగన్రెడ్డి పెట్టిన సూట్కేసు కంపెనీలు, క్విడ్ప్రోకో కింద అక్రమం గా పెట్టుబడుల రూపంలో చేసిన దోపిడీ బాగోతంపై ప్రధానికి, రాష్ట్రపతికి లేఖ రాశా’ అని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డిపై ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం ఆయన ఢిల్లీలో విలేకర్లతో మాట్లాడారు.
తనపై నమోదైన కేసులు కేవలం ఎఫ్ఐఆర్ల స్థాయిలోనే ఉన్నా తనను విదేశాలకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ‘విజయసాయీ... అక్రమార్జన కేసుల్లో నువ్వు ఏ-2 నిందితుడివి. నీపై 15 చార్జిషీట్లు, సీఎం జగన్పై 17 నుంచి 20 చార్జిషీట్లు ఉన్నాయి నీకు విదేశాలకు ఎలా అనుమతి ఇస్తారనుకున్నావ్?’ అని ఆయన నిలదీశారు. బెయిల్ రద్దు కేసులో సీబీఐ ఇద్దరు పీపీల ఆరోగ్యం అర్ధంతరంగా బాగోలేక గైర్హాజరవడంతో విచారణ 30వ తేదీకి వాయిదా పడిందన్నారు.