మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ ద్వారా యువతిని ప్రేమించిన డాక్టర్.. అర్ధరాత్రి యువతికి కడుపునొప్పి రావడంతో ఆస్పత్రికి వెళ్లగా.. అక్కడ ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-02-24T05:58:58+05:30 IST

అతను ఒక ఆస్పత్రిలో సీనియర్ డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ ద్వారా ఒక యువతిని ప్రేమించాడు వారిద్దరూ ఒకరోజు కలుసుకున్నారు. ఆ తరువాత యువతిని ఆస్పత్రి క్వార్టర్స్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు...

మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ ద్వారా యువతిని ప్రేమించిన డాక్టర్.. అర్ధరాత్రి యువతికి కడుపునొప్పి రావడంతో ఆస్పత్రికి వెళ్లగా..  అక్కడ ఏం జరిగిందంటే..

అతను ఒక ఆస్పత్రిలో సీనియర్ డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ ద్వారా ఒక యువతిని ప్రేమించాడు వారిద్దరూ ఒకరోజు కలుసుకున్నారు. ఆ తరువాత యువతిని ఆస్పత్రి క్వార్టర్స్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అత్యాచారం తరువాత యువతి ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను మరో ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలిసి అక్కడి నుంచి పారిపోయాడు.


దేశ రాజధాని ఢిల్లీలోని జీటీబి(గురు తేజ్ బహాదూర్) ఆస్పత్రిలో సీనియర్ డాక్టర్‌గా పనిచేస్తున్న రాకేశ్(35) మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ ద్వారా వైశాలి(30, పేరు మార్చబడినది) అనే యువతికి పరిచయమయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఆ తరువాత వారిద్దరూ ఒకరోజు కలుసుకున్నారు. ఆ రోజు రాత్రి రాకేశ్ తను పనిచేసే ఆస్పత్రికి వైశాలిని తీసుకొచ్చాడు. అక్కడ ఆమెను తన క్వార్టర్స్‌లో తీసుకెళ్లి.. ఆమెపై అత్యాచారం చేశాడు.  వైశాలి ఆ బాధ భరించలేక గట్టిగా అరిచి స్పృహ తప్పి పడిపోయింది. దీంతో రాకేశ్ ఆమెను తను పనిచేసే ఆస్పత్రికి తీసుకుపోకుండా.. సమీపంలోని ఆర్‌ఎమ్ఎల్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు.


ఆ ఆస్పత్రితో డాక్టర్లు వైశాలిని పరీక్షించి ఆమెపై అత్యాచారం జరిగిందని.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైశాలిని ఆస్పత్రికి తీసుకొచ్చిన రాకేశ్‌ను అక్కడి డాక్టర్లు ఎలా జరిగిందని ప్రశ్నించగా.. రాకేశ్ భయపడి అక్కడి నుంచి పారిపోయాడు. వైశాలి ఆరోగ్యం కోలుకున్న తరువాత పోలీసులు ఆమె వాంగ్మూలం తీసుకొని డాక్టర్ రాకేశ్‌ కోసం జీటీబి ఆస్పత్రికి వెళ్లగా.. నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిసింది. ఆ తరువాత పోలీసులు రాకేశ్ ఫోన్ లొకేషన్ ఆధారంగా రాకేశ్ ఆచూకీ తెలుసుకొని అతడిని పట్టుకున్నారు.


Updated Date - 2022-02-24T05:58:58+05:30 IST