ముగ్గురు డాక్టర్లు సహా ఐదుగురికి Covid
ABN , First Publish Date - 2022-01-05T16:13:23+05:30 IST
కోయంబత్తూరులో ముగ్గురు డాక్టర్లు సహా ఐదుగురికి కరోనా పాజిటివ్ లక్షణాలు బయటపడ్డాయి. ఐదుగురూ ప్రైవేటు ఆస్పత్రి చికిత్స పొందుతున్నారు. కోయంబత్తూరు గాంధీపురంలోపో ప్రైవేటు క్లినిక్లో పనిచేస్తున్న ముగ్గురు
చెన్నై: కోయంబత్తూరులో ముగ్గురు డాక్టర్లు సహా ఐదుగురికి కరోనా పాజిటివ్ లక్షణాలు బయటపడ్డాయి. ఐదుగురూ ప్రైవేటు ఆస్పత్రి చికిత్స పొందుతున్నారు. కోయంబత్తూరు గాంధీపురంలోపో ప్రైవేటు క్లినిక్లో పనిచేస్తున్న ముగ్గురు డాక్టర్లు, ఇద్దరు సహాయకులు ఇటీవల అస్వస్థతకు గురయ్యారు. వీరికి కరోనా పరీక్షలు జరిపినప్పుడు పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఐదుగురు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యశాఖ అధికారుల గాంధీ పురంలోని ఆ వీధిలో నివసిస్తున్నవారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.