పీఆర్‌డీ క్యాంపునకు దివిజాదేవి ఎంపిక

ABN , First Publish Date - 2020-12-03T05:08:31+05:30 IST

నెల్లూరులోని డీకేడబ్ల్యూ కళాశాల ఎస్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ దివిజా దేవికి అరుదైన గుర్తింపు లభించింది.

పీఆర్‌డీ క్యాంపునకు దివిజాదేవి ఎంపిక
అధ్యాపకురాలిని అభినందిస్తున్న ప్రిన్సిపాల్‌

నెల్లూర్డు(స్టోన్‌హౌస్‌పేట), నవంబరు 2:  నెల్లూరులోని డీకేడబ్ల్యూ కళాశాల ఎస్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ దివిజా దేవికి అరుదైన గుర్తింపు లభించింది. వెస్ట్‌జోన్‌ ప్రీ రిపబ్లిక్‌ డే క్యాంప్‌ (పీఆర్‌డీ)నకు ఆంధ్రప్రదేశ్‌లోని విశ్వవిద్యాలయాల నుంచి ఎంపిక చేసిన 20 మందికి లీడర్‌గా ఆమె ఎంపికయ్యారు. ఈ క్రమంలో బుధవారం దివిజాదేవిని కళాశాల ప్రాంగణంలో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సీహెచ్‌ మస్తానయ్య అభినందించారు. వెస్ట్‌జోన్‌ పరిధిలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్‌, గోవా, డయ్యూడామన్‌ల నుంచి వచ్చిన రెండు వందల మంది విద్యార్థుల్లో 40 మందిని ఎంపిక చేసి ఢిల్లీలో జరిగే పరేడ్‌లో శిక్షణ అందించే అవకాశం తమ కళాశాల అధ్యాపకురాలికి దక్కడం గర్వంగా ఉందన్నారు.

Updated Date - 2020-12-03T05:08:31+05:30 IST