డాక్టర్ దారుణ హత్య
ABN , First Publish Date - 2020-11-29T06:16:40+05:30 IST
డాక్టర్ దారుణ హత్య
అవనిగడ్డ టౌన్, నవంబరు 28 : అవనిగడ్డలో ప్రముఖ వైద్యుడిగా పేరొందిన డాక్టర్ కోట శ్రీహరిరావు(65) శనివారం దారుణ హత్యకు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డాక్టర్ శ్రీహరిరావు భార్య, కుమార్తె శుక్రవారం మధ్యాహ్నం ఊరుకు వెళ్లారు. డాక్టర్ ఒక్కరే ఇంట్లో ఉన్నారు. తెల్లవారుజామున ఆయన బయటకు వెళ్లాల్సి ఉంది. ఎంతకీ ఇంట్లో నుంచి బయటకు రాకపోవటంతో వైద్యశాలలో ఉన్న నర్సు ఫోన్ చేశారు. స్పందన రాకపోవడంతో పై అంతస్తులోకి వెళ్లి చూసింది. తలుపు తెరిచి ఉంది. పిలిచినా పలకక పోవటంతో లోపలకు వెళ్లి చూడగా, పడకగదిలో రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్న డాక్టర్ శ్రీహరిరావు కనిపించారు. సమాచారం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్బాబు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని డాక్టర్ మృతదేహాన్ని పరిశీలించారు. అనుమానా స్పదంగా ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.