వైసీపీ కండువా కప్పుకున్న సుధారాణి

ABN , First Publish Date - 2021-03-06T17:44:24+05:30 IST

సుధారాణి వైసీపీలో తీర్థం పుచ్చుకున్నారు..

వైసీపీ కండువా కప్పుకున్న సుధారాణి

తిరుపతి : తిరుపతి నగరంలోని సాయిసుధా హాస్పిటల్స్‌ అధినేత డాక్టర్‌ సుధారాణి శుక్రవారం వైసీపీలో చేరారు. స్థానిక 18వ డివిజన్‌లో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారానికి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి హాజరయ్యారు. ఇందులో భాగంగా డాక్టర్‌ సుధారాణి ఎమ్మెల్యే సమక్షంలో వైసీపీలో చేరారు.  ఆమెతో పాటు పల్లవి, డాక్టర్‌ రమణ, పురుషోత్తం, ప్రసాద్‌, రత్నం, మహేష్‌ తదితరులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా డాక్టర్‌ సుధారాణి మాట్లాడుతూ 18డివిజన్‌ వైసీపీ కార్పొరేటర్‌ అభ్యర్థిని అఖండ మేజారిటీతో గెలిపించుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు నీలంబాలాజీ, సులోచనశేఖర్‌రెడ్డి, జీవరత్నం, చంద్ర, అనిల్‌రాయల్‌ తదితరులున్నారు.

Updated Date - 2021-03-06T17:44:24+05:30 IST