కొన్ని రోజులుగా అతడికి తీవ్రమైన కడుపునొప్పి.. స్కానింగ్‌లో చూస్తే.. వామ్మో..!

ABN , First Publish Date - 2021-10-03T02:21:35+05:30 IST

కడుపు నొప్పి చాలా రకాలుగా ఉంటుంది. వస్తే తట్టుకోవడం కష్టం. అజీర్తి.. గ్యాస్ ట్రబుల్ తదితర సమస్యలతో కడుపు నొప్పి వస్తూ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు ఈ నొప్పి ప్రమాదానికి కూడా దారి తీస్తుంది. ఎవరైనా కావాలని ఆరోగ్యం పాడు చేసుకుంటారా..

కొన్ని రోజులుగా అతడికి తీవ్రమైన కడుపునొప్పి.. స్కానింగ్‌లో చూస్తే.. వామ్మో..!

కడుపు నొప్పి చాలా రకాలుగా ఉంటుంది. వస్తే తట్టుకోవడం కష్టం. అజీర్తి.. గ్యాస్ ట్రబుల్ తదితర సమస్యలతో కడుపు నొప్పి వస్తూ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు ఈ నొప్పి ప్రమాదానికి కూడా దారి తీస్తుంది. ఎవరైనా కావాలని ఆరోగ్యం పాడు చేసుకుంటారా.. చేసుకోరు కదా.. అయితే ఓ వ్యక్తి చేజేతులా సమస్య తెచ్చిపెట్టుకున్నాడు. అది కూడా డాక్టర్లు కూడా ఊహించనంత సమస్య. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అయింది. దీనిపై పలువురు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 


విల్నియస్ లిత్వేనియాలో ఓ వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతడు మద్యానికి బానిసయ్యాడు. మానుకోవాలని ఎంత ప్రయత్నించినా కుదరలేదు. ఈ క్రమంలో పలు ప్రయోగాలు చేశాడు. గోర్లు కొరికేయడం అలవాటుగా చేసుకున్నా ఫలితం లేదు. చివరకు అనుకోకుండా ఇనుప వస్తువులను కూడా తినడం ప్రారంభించాడు. దీంతో కొన్ని రోజులుగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. నొప్పి తీవ్రమవడంతో కుటుంబ సభ్యులు.. అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. 


అతన్ని పరిశీలించిన వైద్యులు.. స్కానింగ్ చేశారు. అతని కడుపులో కొన్ని వస్తువులను చూసి షాక్ అయ్యారు. దాదాపు కిలోకి పైగా నట్టులు, బోల్టులు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం శస్త్ర చికిత్స చేసి.. స్క్రూలు, నట్లు, గోర్లను బయటకు తీశారు. ఎలాంటి ప్రాణాపాయమూ లేదని వైద్యులు తెలపడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Updated Date - 2021-10-03T02:21:35+05:30 IST